Friday, April 19, 2024
More
    Homeలీగల్ న్యూస్కరోనా సమయంలో బహిరంగ వేలం ఎలా నిర్వహిస్తారు? : హైకోర్టు

    కరోనా సమయంలో బహిరంగ వేలం ఎలా నిర్వహిస్తారు? : హైకోర్టు

     కరోనా సమయంలో బహిరంగ వేలం ఎలా నిర్వహిస్తారని ఎపి ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్రంలో దేవాదాయ భూములను బహిరంగ వేలం వేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆదేశాలను సవాల్‌ చేస్తూ ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మంగళవారం ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. రాష్ట్రంలో కరోనా, కర్ఫ్యూ ఉండగా బహిరంగ వేలం నిర్వహించడమేంటని ప్రశ్నించింది. వేలం కోసం కృష్ణా జిల్లా పెద్దకళ్లెపల్లిలో ఆలయం పిలిచిన టెండర్‌ ఆదేశాలను హైకోర్టు రద్దు చేసింది. ఈ విషయమై కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ జులై 7వ తేదీకి వాయిదా వేసింది.

    Most Popular