Wednesday, April 24, 2024
More
    Homeక్రైమ్ న్యూస్భర్తను మించిన భార్య, ఇద్దరికీ అక్రమ సంబంధాలు.. ఆ తర్వాత హత్య

    భర్తను మించిన భార్య, ఇద్దరికీ అక్రమ సంబంధాలు.. ఆ తర్వాత హత్య

    ఢిల్లీలోని నిహాల్‌ ఏరియాలో భువనేశ్వరి, అనిల్‌ అనే దంపతులు నివాసముంటున్నారు. అనిల్‌ ఎప్పడూ భార్యను హింసించేవాడు. ఎందుకా అని ఆమె ఆరా తీయగా అతను మరోక అమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. దాన్ని ఎక్కడ ప్రశ్నిస్తుందమోనని భార్యను నిరంతరం వేధించాడు. ఈలోపు భార్య కూడా భర్త దారినే ఎంచుకుంది. ఆమె రాజ్‌ అనే అతనుతో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇది తెలిసి అనిల్‌ మరింత వేధించ సాగాడు. దీన్ని తట్టుకోలేని భువనేశ్వరి భర్తను చంపాలని ప్రియుడు రాజ్‌తో కలిసి ప్లాన్‌ చేసింది.

    అనిల్‌ తినే అన్నంలో నిద్రమాత్రలు కలిపింది. భోజనం తర్వాత అనిల్‌ సృహ తప్పాడు. వీరు చంపేద్దమని ప్రయత్నించగానే మేల్కోన్నాడు. దీంతో రాజ్‌కు, అనిల్‌కు మధ్య కొట్లాట జరిగింది. భువనేశ్వరి భర్త చేతులను గట్టిగా పట్టుకోగా రాజ్‌ కొట్టి కొట్టి అనిల్‌ను చంపేశాడు. ఎవరో దుండగులు ఇద్దరు వచ్చి చంపి వెళ్లిపోయారనే కథను భువనేశ్వరి పోలీసులకు చెప్పింది. కానీ పోలీసులు నమ్మలేదు. విచారణలో అసలు విషయాలు బయటకు వచ్చాయి.

    Most Popular