Friday, April 26, 2024
More
    Homeసివిల్ కేసులుమెడికల్ కేసులుప్రభుత్వ హాస్పటల్లో రోగుల పట్ల వైద్యులు నిర్లక్ష్యం వహిస్తే కేసు వేయవచ్చా?

    ప్రభుత్వ హాస్పటల్లో రోగుల పట్ల వైద్యులు నిర్లక్ష్యం వహిస్తే కేసు వేయవచ్చా?


    ప్రభుత్వ హాస్పటల్లో సరైన వైద్యం చేయకున్నా, సరిగి పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించి రోగికి నష్టం కల్గించిదే ఆ హాస్పిటల్లో చేరినట్లు ఉన్న ప్రిస్కిప్షన్‌, ఇతర ఆధారాలతో వినియోగారుల ఫోరంకు ఫిర్యాదు చేయవచ్చు. ఇది సేవలకు సంబంధించిన విషయం కాబట్టి వినియోగదారుల ఫోరంకు మాత్రమే వెళ్లాలి. అక్కడ వైద్యులు చేసిన తప్పు రుజువైతే నష్టపరిహారం లభిస్తుంది. దీంతోపాటు వైద్య ఆరోగ్య శాఖకు ఫిర్యాదు చేస్తే వారి విచారణలో డాక్టర్‌ తప్పు చేసినట్లు తేలితే ప్రభుత్వం ఇంక్రిమెంట్లలో కోత పెట్టడం, లేదా కొద్దికాలం సస్పెండ్‌ చేయడం లేదా అసలు ఉద్యోగం లోంచే తీసివేయడం జరుగుతుంది. పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి క్రిమినల్‌ కేసులు కూడా వేయవచ్చు.

    Most Popular